పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచుల నిరసన.

#ప్రభుత్వ మారిన సర్పంచుల బతుకు మారలేదు.

#పంచాయతీలో ప్రత్యేక అధికారి పాలన రావడంతో దిక్కుతోచని స్థితిలో మాజీ సర్పంచులు.

#అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోని ప్రభుత్వం.

#సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: సర్పంచ్ పదవి కాలంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో గురువారం నల్లబెల్లి మండల సర్పంచులు మండల పరిషత్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎంపీ ఓ కూచన ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన పనులకు సర్పంచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు సంబంధిత మంత్రి సీతక్కకు రాష్ట్ర సర్పంచ్ల సంఘం తరఫున ఎన్నోసార్లు సమస్యపై విన్నవించిన ఏమాత్రం స్పందించ లేదని గ్రామ అభివృద్ధి పనులకై ఆస్తులతో పాటు అప్పులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఎంతోమంది సర్పంచులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలకు తక్షణమే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని లేనియెడల సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీకటి ప్రకాష్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, రత్నాకర్ రావు, చింతపట్ల సురేష్, తిరుపతి, రాజు, సాంబయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!