Sarpanch Nagender Patel Felicitates New Tahsildar C Bhaskar
నూతన తాసిల్దార్ ను సన్మానించిన సర్పంచ్ నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల తహసీల్దార్ గా సి. భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ నాయకులు శనివారం తహసీల్దార్ ను కలిసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. రైతుల, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ ను కోరారు. పాలనకు పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నవాబ్ సంగమేశ్వర్, నాయకులుబ్పల్గొన్నారు.
