Cash-for-Vote Scam in Sarpanch Elections
సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4వేలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో రొండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ, ఒక్కో ఓటుకు రూ.1000 నుండి రూ.4000 వరకు పంచుతున్నట్లు సమాచారం.
గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు ఇచ్చి, ఓటు వేయాలని కోరుతున్నారు. మద్యం క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీ కూడా జోరుగా సాగుతోంది..
