
Jago Telangana Demands Saree Distribution for Poor in Dasara
నిరుపేదలకు రానన్న దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి
◆:- జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ అంటేనే తెలంగాణ పండుగ అంతటి ప్రాధాన్యత ఉన్న పండుగకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నిరుపేద ప్రజలకు కెసిఆర్ గారి మంచి ఆలోచనతో తెలంగాణలో దసరా పండుగ అందరు జరుపుకోవాలని ప్రజలు ఆనందంగా సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్న బతుకమ్మ చీరలు బందు చేశారు నిరుపేద తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు మంచి నూనె సబ్బులు సరఫరా చేయాలి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు లక్షలాదిగా ఉన్నారు అందరూ ఉన్నవాళ్లే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వము అని గొప్పలు చెప్పుకోవడం కాదు పేదలకు కడుపునిండా అన్నం పెట్టడం వారికి దసరా పండుగ జరుపుకోవడానికి అన్ని సదుపాయాలు చేయడం అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలు నిర్ణయిస్తారు జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత మొహమ్మద్ ఇమ్రాన్ ప్రధాన కార్యవర్గ సభ్యులు, మరియు, మాదినం శివప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది,