
Sardar Sarvai Papanna 375th Jayanti Celebrations
సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని గౌడ సోదరులు ముందుండి బహుజన సోదరులను ఆహ్వానిస్తూ అందరూ కలిసి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆయన బహుజన బహుజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు.చాలా గ్రామాల్లో పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్నాయని లేనిచోట్ల ఆయన ఫోటోకు పూలదండలు వేసి వేడుకలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ గౌడ సంఘం అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘ సభ్యులు అబ్బూరి ఆనంద్ రాజ్, చీకట్ల వేణు గౌడ్, అబ్బూరి ప్రకాష్ గౌడ్, నేరెళ్ల రాజకుమార్ గౌడ్, అబ్బూరి శ్రీనివాస్, నేరెళ్ల అంజా గౌడ్, ఎలుక శివలింగం, అబ్బూరి దశ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.