
Sardar Sarvai Papanna Goud Jayanti Celebrated
గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చత్రపతి అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వ కారణం అని మొగులు సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ని ప్రభుత్వం పట్టించుకునే పాపను పోలేదన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటుకు కృషి చేస్తున్నారని వచ్చే జయంతి వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సభ్యులు బజార్ సిద్దా గౌడ్, వెల్దుర్తి బాల్ రాజా గౌడ్, బజార్ వెంకట గౌడ్,చంద్ర గౌడ్, బజారు చిన్న తిరుమల గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్,బజారు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,అంజా గౌడ్, పర్షరాములు గౌడ్, వినయ్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, సత్య గౌడ్, చంద్రకాంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.