కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి
తిరుగు ప్రయాణం లో స్వామివారి దర్శనం
చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో గత 12 రోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కోటగుళ్లను సందర్శిస్తున్నారు. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతా నికి చెందిన భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు కూడా కోట గుళ్ళ ను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆలయ విశిష్టతను వివరించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు.