వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి
జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబీ అధికారులకు ఆదేశాలు
వనపర్తి నేటిధాత్రి:
ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుక అందించేందుకు వనపర్తి జిల్లాలో ఇసుక రీచులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వనపర్తి జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ ఇసుక రీచ్ లు గుర్తించారు వాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది అధికారులతో చర్చించారు
తుంపల్లి గ్రామం వీరరాఘవపూర్ ఇసుక రీచ్ లో 3990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఇరిగేషన్ భూగర్భ జలాలుమైన్స్ అండ్ జియాలజి ద్వారా పరిశీలన చేసిన రిపోర్టును కలెక్టర్ ముందు ఉంచారు వీర రాఘవపూర్ రీచ్ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక తీసుకునేందుకు కమిటీ తీర్మానం చేసింది .మదనపూర్ మండలములోని కొత్తపల్లి దుప్పల్లి రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇసుక లభ్యత లేదని మైన్స్ అధికారి తెలుపగా ఆన్లైన్ మ్యాప్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ కమిటీ సభ్యులు మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దమందడి మండలం చిలకటోనీ పల్లి కర్వేన గ్రామాల్లోనీ రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధన ప్రకారం ఉండాల్సిన ఇసుక లభ్యత లేదని అందువల్ల రీచ్ గా పరిగణించి ఇసుక తీసుకోలేమని కమిటీ నిర్ధారించింది అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఎ డిమైన్స్ గోవిందరాజులు భూగర్భ జలాల ఎ డి దివ్యజ్యోతి డి ఎల్పీఒ రఘునాథ్ ఇరిగేషన్ శాఖ అధికారి పాల్గొన్నారు