భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భగత్ సింగ్ విగ్రహానికి జనసేన పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నాయకుడు సనత్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ 117వ జయంతిని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది భగత్ సింగ్ నునూరు మీసాల వయసులోని దేశం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ ప్రాణాలను సైతం దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే అర్పించిన నాయకుడు మనం అందరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాకేష్ మధు శ్రీకాంత్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు