బ్రిడ్జి కోసం నేరేడుపల్లి ప్రజలు ఎదురుచూపులు
ఇబ్బంది పడుతున్న రైతన్నలు.
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామం నేరేడు పల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్రఇబ్బందులు గురవు తున్నారు. మండలానికి పోవాలంటే గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల ప్రగసింగారం, మాంధారిపేట, కటాక్ష పూర్ ఆత్మకూర్ మీదుగా బస్సు ప్రయాణం చేయడం చుట్టూ తిరగడం వల్ల 20 కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా మండలానికి అతి సమీపంగా పత్తిపాక గ్రామం మీదుగా 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగు దాక వేసి కరెంటు అన్ని ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరారు.