అనారోగ్యంతో శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుడు మృతి

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ లో బాయిలర్ వర్కర్ గా 20 సంవత్సరాలుగా పనిచేసిన గంగుల శ్రీనివాస్ వయసు 48 అనే కార్మికుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. చికిత్స పొందుతూ బుధవారం రోజున తుదిశ్వాస విడిచారు.
శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ పవర్ ప్లాంట్ క్లోజ్ చేసి గత 18 నెలలు కావస్తున్న, యాజమాన్యం క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే, కార్మికుడు చనిపోయాడు, యాజమాన్యం కార్మికులకు  రావలసిన బెనిఫిట్స్ సకాలం చెల్లించి ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని ఆరోగ్యం బాగు చేసుకునేవాడని తెలియజేశారు. శాలివాహన పవర్ ప్లాంట్ యాజమాన్యం బెనిఫిట్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే గంగుల శ్రీనివాస్ అనే కార్మికులు మృతి చెందాడు అతని కుటుంబమునకు, కార్మిక చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కాకుండా అదనంగా 20 లక్షల రూపాయలు చెల్లించాలని భారతీయ మజ్దూర్  సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!