సంఘటిత సహకార శక్తి పెంపు కోసం సకృషి ఉద్యమం.
విజయవంతమైన 19వ వార్షిక మహాసభ..
10 వ సారి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..
నర్సంపేట నేటిధాత్రి:
గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల పొదుపు సంఘం 19 వార్షిక మహాసభ సంఘ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. 2024 జనవరి నుండి 2025 మార్చి నెల వరకు సంఘంలో జరిగిన లావాదేవీలు,ఆస్తుల వివరాల పట్ల నివేదిక రూపంలో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టారు. పొదుపు సంఘంలో నిర్వహిస్తున్న వివిధ ఖాతాల పట్ల మహాసభలో చర్చించి సంఘం అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలతో చర్చించుకున్నారు.

2025 మార్చి నెల వరకు 410 మంది సభ్యులతో రూ. 60 లక్షల 76 వేల 567 నిధులు ఉన్నట్లు గణకుడు ఏడెల్లి మహేందర్ రెడ్డి తెలియజేశారు.ముఖ్య అతిథులుగా హాజరైన సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ సంఘం సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా సభ్యుల ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల కుమారస్వామి పేర్కొన్నారు. ఉత్తమ సంఘ సభ్యునిగా ఎన్నికైన వరంగంటి ప్రవీణ్ రెడ్డి, ఉత్తమ పాలకవర్గ సభ్యులు భాషబోయిన రాజు, ఉప్పుల రాజు, బానోతు రమేష్,కందుల శ్రీనివాస్ గౌడ్ లకు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..
2025 – 26 సంవత్సరానికి గాను నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక కోసం ఎన్నికల నిర్వహించగా సంఘం అధ్యక్షులుగా కందుల శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా వడ్డేపల్లి మృత్యుంజయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ప్రకటించారు.

అధ్యక్షుడిగా 10వ సారి ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్..
చంద్రయ్యపల్లి గ్రామంలో సహకార వికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చంద్ర పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులుగా వరుసగా పదవసారి ఎన్నికయ్యారు. తన ఎన్నిక పట్ల మరింత బాధ్యత పెరిగిందని అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బానోతు రమేష్, భాషబోయిన రాజు, పాక రాజయ్య, సలపాల ప్రభాకర్, భాషబోయిన చరణ్ రాజ్,మామిడి ఐలయ్య,ఉప్పుల రాజు,బానోతు సాంబయ్య,అజ్మీర జితేందర్, సయ్యద్ బషీర్ తోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.