తారకరామ కాలనీలో కుంకుమ పూజ మహోత్సవం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాల వద్ద వద్ద భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక తారక గణేష్ మండలి వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుడు కిరణ్ మంత్రోత్సవాలతో కుంకుమార్చన పూజ మహోత్సవం నిర్వహించగా, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం గణనాథుడికి నైవేద్యం సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు చిట్టంపల్లి శ్రీనివాస్, ఆవునూరు తిరుపతి, కుదిరె సతీష్, గుడికందుల నవీన్, ల్యాగల శ్రీనివాస్, తూడి కిరణ్, కుదిరే వెంకటేష్, జంగ రాములు, చిట్టంపల్లి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!