ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు.

Congress Congress

ఆదర్శంగా సాధనపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు

పెద్దమ్మతల్లి దేవాలయ విగ్రహాలకు లక్ష సహాయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముది రాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి,దేవాలయంలో ప్రతిష్టిం చే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం లక్ష రూపాయ లు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్ర తిష్ట కార్యక్రమం నిర్వహించ నున్నారు. తన వయసుకు మించి గ్రామం కోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూ ర్వకంగా అభినందించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!