రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి):
మంగళవారం ప్రకటించిన ఎస్. ఎస్. సి – 2024 ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టూడెంట్స్ ప్రభంజనాన్ని సృష్టించారు. హాజరైన 16 మంది విద్యార్థులలో నలుగురు విద్యార్థులు 10 జీపీఏ,
ఇద్దరు 9.8, ఇద్దరు 9.7, 6 మంది విద్యార్థులు 9.0 జిపిఏ ఆపైన సాధించారని మరియు 100 శాతం ఉత్తీర్ణత సాధించామని తెలుపుతూ సంతోషిస్తున్నామని అన్నారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, విద్యాశాఖ అధికారి రమేష్ అభినందించారు.
ఎస్. ఎస్. సి ఫలితాలలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం ప్రభంజనం
