గ్రామీణ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి.

# నర్సంపేట ఎంపీడీవో శ్రీనివాస్ రావు.
# ఈజీఎస్ పనుల ఉపయోగం పట్ల అవగాహన సదస్సు.

నర్సంపేట,నేటిధాత్రి :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పూర్తిస్థాయి సబ్సిడీతో అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. నర్సంపేట మండలంలోని రాజేశ్వర్ రావుపల్లె గ్రామపంచాయతీ శివారు రాంనగర్ గ్రామంలో గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల పట్ల అవగాహన సదస్సు పంచాయతీ కార్యదర్శి రజియా అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. 2025 – 2026 సంవత్సరం గాను గ్రామ పంచాయితీ పరిధిలో అవసరమయ్యే పలు రకాల పనులను గుర్తించారు.ముందుగా ఈజీఎస్ పథకంలో అమలవుతున్న 266 పనుల పట్ల ఉపయోగాలు వాటి వల్ల లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈజీఎస్ పథకంలో అమలవుతున్న రైతు పథకాలైన మునగా, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ తోటలు అలాగే మట్టి కుంటలు, ఫామ్ ఫౌండ్స్, చేపల పెంపకం, మట్టికట్ట, కొత్తబావులు, నీటి కుంటలు, సరిహద్దు కందకాలు, నాడెం కంపోస్టు, పండ్ల తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు, కొబ్బరి తోటలు, పశువుల పాక గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లు లను ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్నాయని ఎంపీడీవో వివరించారు. వీటిని గ్రామంలోని గ్రామాల్లోని అర్హత గల ప్రతి రైతు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో పలు ప్రాంతాలను ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు మండలంలోని చంద్రయ్యపల్లి, మహేశ్వరం, కమ్మపల్లి గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు మాటేటి శ్రీను, సురేందర్, శ్రీనివాస్, గ్రామస్తులు ఐలయ్య కృష్ణంరాజు భూషబోయిన సురేష్, కీసరి చిరంజీవి, రంజిత్,అజయ్, కోటి, రాజేందర్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!