గుండాల లో రన్ ఫర్ యూనిటీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T122921.932.wav?_=1

 

 

గుండాల లో రన్ ఫర్ యూనిటీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం గుండాల పోలీస్ లు నిర్వహించారు. ఇందులో భాగంగా గుండాల సెంటర్ నుండి గురుకులం స్కూల్ వరకు రెండు కిలోమీటర్లు రన్నింగ్ నిర్వహించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహిచమని గుండాల ఎస్సై సైదా రహూఫ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో 200 మంది విద్యార్థులు,యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై రహూఫ్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని అయన పేర్కొన్నారు.యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే సమరయోధులకు నిజమైన నివాళిఅర్పించినట్టవుతుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version