బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.
బెల్లంపల్లి నేటిధాత్రి :
గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భముగా యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానములను స్మరించు కొంటూ , బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లోని క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం లోని క్రైస్తవ మత పెద్దలు రెవ సి హెచ్ అశోక్, ఫాదర్ కురియన్, జార్జ్ మాత్యు , జోషి, స్వామి జాకబ్ వారి ఆద్వర్యం లోని సంఘాల విశ్వాసులు ప్రార్ధనా పూర్వకంగా పాల్గొని కార్యక్రం జయప్రదం చేశారు.