డిప్యూటీ సీఎం ఓఎస్డీ ని కలిసిన ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హన్మకొండ:నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీ గా నియమితులైన సత్యనారాయణ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు తెలంగాణ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం గురించి వివరించి ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఆర్టిఐ చట్టం పోరాటం చేస్తుందని ఓఎస్డీ కి వివరించారు తరువాత సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 అనేది ప్రతి పబ్లిక్ అథారిటీ యొక్క పనిలో పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రభుత్వ అధికారుల నియంత్రణలో సమాచారాన్ని పొందేందుకు పౌరులకు సమాచార హక్కు యొక్క ఆచరణాత్మక పాలనను ఏర్పాటు చేయడానికి ఒక చట్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, బబ్లూ,భోగం విష్ణు, అఖిల, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *