New Pallevelugu Hire Bus Launched
నూతన హైర్ బస్ ప్రారంభించిన ఆర్టీసీ డీఎం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఆర్టీసీ డిపోలో నర్సంపేట నుండి వరంగల్ పల్లెవెలుగు హైర్ బస్సును వరంగల్ జిల్లా హైర్ బస్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్ అద్వర్యంలో
తెలంగాణ అద్దె బస్సుల గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ తో కలిసి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి ప్రారంభించారు.డిపో మెనేజర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైనా రవాణ కోసం ఈ సర్విస్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. సురక్షితమైన ప్రాయణం కోసం ఆర్టిసి సేవలను ఉపాయోగించుకోవాలని కోరారు. ఈ కార్యకమంలో వరంగల్ రీజినల్ కన్వీనర్ మారపేల్లి రామ్ రెడ్డి లింగారెడ్డి, డిపో హెడ్ గార్డ్ వీరారెడ్డి, గోవర్ధన్, వేముల రవి, మేడిపల్లి వెంకన్న,అశోక్ రెడ్డి, శ్రీనివాస్, రాంబాబు, రాము,భాస్కర్ రెడ్డి,లక్కం వేణు, కట్ల ప్రశాంత్,లక్కం శ్రీను, బండారి సుమన్,ఎస్ రవిందర్, రంజిత్, రాజేశ్వర్ తదితర డిపో సిబ్బంది పాల్గొన్నారు.
