
RSS Panch Parivartan for Bharat’s Global Rise
ప్రపంచంలో భారత్ అగ్రగామికోసం ఆర్ఎస్ఎస్ దీక్ష *
ఆర్ ఎస్ ఎస్ గ్రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ *
మహాదేవపూర్ అక్టోబర్01 నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారతదేశం ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టిందనీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ సత్యనారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ముఖ్యమని కార్యకర్తలు కూడా దేశం తర్వాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యమిచ్చే వారే ఈ సంస్థకోసం నిలబడతారని అన్నారు. పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడానికి కట్టుబడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. స్వ ఆధారిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వభాష, స్వవేషం, స్వ సంస్కృతి తోపాటు స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా మానక మానసిక స్థితిని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పండుగ పర్వదినాలలో సమిష్టి కుటుంబంలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించారన్నారు. పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేదని అలాంటి సమాజాన్ని పునర్ నిర్మించాలన్నారు అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడని భావించే సమరసత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించారని రాజ్యాంగం, చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరోపదేళ్లలో ప్రపంచంలోని అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ లో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరావు, తదితరులు పాల్గొన్నారు.