
Rs.3.30 Crore Allocated for Hostel Repairs in Sangareddy
వసతి గృహాల మరమత్తులకు రూ. 3.30 కోట్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తుల కోసం రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించిన ఈ నిధులతో సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, ప్రహరీ గోడల నిర్మాణం, బాత్రూమ్, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపడతామని ఆయన వివరించారు.