
Social Media District President.
ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం
దేవేందర్ పటేల్, కేటీఆర్ సేన సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం లోని అంకుషాపూర్ సోమనపల్లి గ్రామ పురాతనమైన ఎంతో విశిష్టత మహిమ కలిగిన శ్రీ అభయాంజనేయ ఆలయం శిథిల అవస్థలో ఉండడం వలన ఉమ్మడి గ్రామాల ప్రజలు అభివృద్ధి కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది, మూడు రోజులు అంగరంగ వైభవంగా మే 31 వ రోజు నాడు గణపతి పూజతో ప్రారంభమై అయి జూన్ 1వ తారీకు నాడు విగ్రహాలను జల నివాసం చేయడం జరిగింది, జూన్ రెండో తారీకు శ్రీ అభి ఆంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభం గణపతి సుబ్రహ్మణ్యస్వామి నవగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది, మూడు రోజులు పాటు సోమనపల్లి అంకుషాపూర్ ఉమ్మడి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మూడు రోజులు మహా అన్నదానం ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది,
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కి దేవేందర్ పటేల్ కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి 10,116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నందికొండ రామ్ రెడ్డి, పెంట రమేష్, పెద్దోజు రమణాచారి మీసేవ, పోతన వేన ఐలయ్య, అబ్బేంగుల శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, పెద్దోజు భీష్మాచారి మంద రాజయ్య, నందికొండ రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు