ఆగిన రోడ్డు మరమ్మతులు.

BRS Government. BRS Government.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.
BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!