రామకృష్ణాపూర్, మార్చి 01, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణం విధ్యానగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ జనగామ శ్రీనివాస్ వాళ్ళ నాన్న జనగామ మల్లేష్ అనారోగ్యంతో చనిపోయిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకునీ దహాన సంస్కారాల కోసం యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయం 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి యువత సలహదారు బింగి శివకిరణ్ యువ నాయకులు గంగారపు సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు…