వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి – మహ్మద్ జమాలోద్దిన్ అక్బర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర, కిష్టాపూర్, షానగర్, కోరటపల్లి, తిర్మలాపూర్ గ్రామాలు, గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి, ముప్పిడినర్సయ్యపల్లి గ్రామాలలో వరిధాన్య కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నోడల్ అధికారి మహ్మద్ జమాలోద్దిన్ అక్బర్. ఈసందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ రైతులు కోనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోని మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో సహకార సంఘ సిబ్బంది, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *