సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్.

Chairman Chairman

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్…

సిఎండి బలరాం నాయక్ ను కలిసిన జర్నలిస్టులు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

shine junior college
shine junior college

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన మందమర్రి రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అనిల్ భగత్ ఉపాధ్యక్షుడు అక్బర్ లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వేదికగా సిఎండి బలరాం నాయక్ ను కలిసి సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలని కోరారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని, మునీర్ విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కోల్ బెల్ట్ లో మునీర్ అబిమానులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ భగత్ అక్బర్ లు తెలిపారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన మునీర్ మృతి నల్ల నేలకు తీరని లోటు అని సింగరేణి చరిత్రలో మునీర్ ప్రజల హృదయాలో సజీవంగా ఉంటారని, సీనియర్ పాత్రికేయులు మునీర్ జర్నలిస్టులకు ఆదర్శం అని బలరాం నాయక్ అన్నారు. ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!