అచ్చంపేటలో బీజేపీ సంస్థ కథ సమీక్ష
అచ్చంపేట నేటి ధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట రూరల్ మండలంలోని శక్తి కేంద్ర ప్రముఖ్, ప్రభారీల నియామకాల సంస్థాగత సమీక్ష బీజేపీ మండల అధ్యక్షులు కాట్రావత్ జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు మోక్తల రేణయ్య, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు వరికుప్పల ఆంజనేయులు, బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అఖిల్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గోవిందు అనిల్ పాల్గొన్నారు. మండలంలో 10 శక్తి కేంద్రలకు ప్రముఖ్, ప్రభరీలను నియమించడం జరిగిందన్నారు.