బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం

జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి హాజరైనారు.
అనంతరం
వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ మరింత బలపడేలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రాష్ట్రంలోని గ్రామాల వారీగా పార్టీని మొదటి స్థానంలో తీసుకెళ్లేలా పోలింగ్ బూత్ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సాధనంగా ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు భాగస్వామ్యమై, అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా ప్రతి ఒక్కరూ మరో వందమందిని సభ్యుడిగా చేర్పించే విధంగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సభ్యత్వ జిల్లా ప్రబారి రాజ వర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వెన్నంపల్లి పాపన్న నాగపురి రాజమౌళి గౌడ్ చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగేందర్ జిల్లా సభ్యత్ ఇంచార్జ్ జన్న మొగిలి సభ్యత్వ ప్రముఖ్ లు , సహ ప్రముఖ్ లు, వివిధ మండలాధ్యక్షులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *