మర్రి చెట్లను తొలగించాలని కమిషనర్ కు వినతి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషు పల్లి గ్రామం నుండి క్యాతనపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మర్రి చెట్లు ఉన్నందున రోడ్డు పగిలిపోతుందని, మర్రి చెట్లను తొలగించి వేరే చెట్లను పెట్టేలా చొరవ తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయించేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగిందని మాజీ వైస్ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నంది సురేష్, నరేష్, బండారి ప్రశాంత్, ప్రమోద్ ,సాయికిరణ్, కుర్మ విజయ్, నంది అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.