పద్మశాలి సంఘం, కార్మిక సంఘం, భావన రుషి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు/గంగాధర, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో పద్మశాలి సంఘం, కార్మిక సంఘం, భావన రుషి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఒక పండుగలాగా నిర్వహించారు. ఈకార్యక్రమం సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు అన్నల్దాస్ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ మన పద్మశాలి ఐక్యత ఇలాగనే ఎప్పటికీ కనువిందుగా ఈజెండా పండుగ చేసుకోవాలిని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు గుండ రాజేశం, నల్ల శ్రీనివాస్, దూస సురేందర్, కార్యవర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి తిరుపతి, ఎంపీటీసీ రజిత రమేష్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు భావన, ఋషి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సురేందర్, క్యాషియర్ గణేష్, సభ్యులు, కార్మిక సంఘం అధ్యక్షులు గడ్డం నారాయణ, ఉపాధ్యక్షులు రేణికుంట శ్రీనివాస్, కార్మిక వర్కర్లు, పద్మశాలికుల బంధువులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *