నిజాంపేటలో..ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజాంపేట: నేటి ధాత్రి
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్, ఎంపీడీవో కార్యాలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, పశువైద్య కార్యాలయం లో మణికుమార్, విద్యుత్ కార్యాలయంలో ఎఈ గణేష్, వివిధ గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
