*ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ కు స్వాగతం పలికిన..
*రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ..
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 05:
తిరుపతి పట్నాలు
వీధిలో స్థానికంగా గల శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవం -2025 మార్చి 14 నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి .ఈ నేపద్యంలో ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్,ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ను వార్షిక మహోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు దిలీప్ అధ్యక్షతన ప్రణీత్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ శ్రీ రేణుక పరమేశ్వరి వారి మహోత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన శక్తి మేర మహోత్సవాలలో జరిగే అన్నదానానికి ఆలయ అలంకరణకు కావాల్సిన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడిఫై స్కూల్ సిబ్బంది ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..