ఎంపీపీ చేతుల మీదుగా సంక్షేమ పథకాల కరపత్రం విడుదల.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక బీ ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎంపీపీ చేతుల మీదుగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ మజీబ్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల మైనార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో ఎంపీపీ చేతుల మీదుగా కరపత్రం విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మంత్రి కేటీ రామారావు గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఇన్చార్జి అంజాద్ పాషా మహమ్మద్ పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులుగ్రామ శాఖ అధ్యక్షులు జగన్ మైనార్టీ మండల అధ్యక్షురాలు సహిదా బేగం మండల జాగృతి అధ్యక్షులు రామా గౌడ్ మండల మైనార్టీ నాయకులు అబూబకర్ భాష్మియా నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!