5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

మంచిర్యాల, నేటి ధాత్రి:

మందమర్రి కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు మంచిర్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 5వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ మాట్లాడుతూ వ్యాపార,వాణిజ్య, పారిశ్రామిక, వస్తు మార్పిడి, మొదలగు రంగాలకు అవసరమైన రవాణా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించేటువంటి లారీ వాహనాలను ట్రాన్స్ పోర్టు వారు చిన్న చూపు చూస్తున్నారని, పెరిగిన ఇంధన ధరలు, సరిగా తెలియని లోడ్ తీసుకువెళ్లే దూరం, లారీ మరమత్తులు, డ్రైవర్ల క్లీనర్ల జీతభత్యాలు ఇలా ఎన్నో విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఎన్నో ట్రాఫిక్ కష్టాలను పడుతూ సరైన సమయానికి సరుకును అందించి వ్యాపారులకు వినియోగదారులకు మధ్య వారధిల పని చేసే లారీ వ్యవస్థని తక్కువగా చేసి చూడొద్దని, ఇప్పటికైనా మంచిర్యాల కోల్ ట్రాన్స్ పోర్ట్ వారు మొండి వైఖరిని వీడి మా అసోసియేషన్ యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు కోరుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *