శరణార్థులను ఆదుకోవాలి.
సోషలిస్ట్ రిపబ్లికం అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే
మంచిర్యాల జూన్ 20 నేటి ధాత్రి:
శరణార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఎస్ ఆర్ ఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… యుద్ధాలు, హింస, లేదా ఇతర కారణాల వల్ల తమ దేశాలను వదిలి వలస వచ్చిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, వైద్య సహాయం, విద్యను అందించి వారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఆయన అన్నారు.
శరణార్థుల చట్టపరమైన న్యాయపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.వారు సమాజంలో కలిసిపోయేలా మరియు సమాన అవకాశాలు పొందేలా చూడాలన్నారు. వారిని సామాజిక దృక్పథంతో అర్థం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎస్ ఆర్ ఏ రాష్ట్ర నాయకులు సైకాలజిస్ట్ డాక్టర్ అంబాల సమ్మయ్య, జిల్లా నాయకుడు కాంపెల్లి హరి చరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.