దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ చాలీసా పారాయణం…
ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ..
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ చాలీసా,108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరిగిందని ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ తెలిపారు.హనుమాన్ మాల ధరించిన ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసాలో అత్యంత వైభవోపేతంగా పాల్గొన్నారు.

భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అవరోధాలకు తావులేకుండా, ఎలాంటి విపత్తులు కలగకుండా ప్రజలంతా ఆయురారోగ్య, అష్టయిశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శనివారం రోజున హనుమాన్ యజ్ఞం, మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాల ధరించిన సాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన నేపద్యంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.