తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీవో రమాదేవి

రామయంపేట (మెదక్)నేటిధాత్రి
మెదక్ జిల్లా రామాయంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.అదేవిధంగా ప్రజావాణి దరఖాస్తుల విషయం ధరణి ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై గడువు లోపల సమస్యలను పరిష్కరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి వాటిపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని రామాయంపేట తహసిల్దార్ రజినీ కుమారి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!