జహీరాబాద్ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మిథున్ రాజ్, ఎమ్మార్వో దశరద్ సింగ్, మోహన్ రెడ్డి, రైతుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్, వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.