RB officials
100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆర్ అండ్ బి అధికారులు
త్వరలో ప్రారంభం కానున్న పనులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం రోడ్డు వెడల్పు పనులకు ఆర్ అండ్ బి అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో మార్కింగ్ చేశారు. ఆర్ అండ్ బి ఏఈ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కొలతలు పూర్తి చేశారు. సుమారు 18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎఈ నవీన్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ఉమ్మల్ల విజేందర్ తదితర సిబ్బంది ఉన్నారు.
