Rashtriya Ekta Diwas Celebrated at Sircilla Junior College
ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరిసిల్లలో లో”NSS- ఆధ్వర్యంలో ” జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ఘనంగా నిర్వహిస్తూ, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్ భారత మాజీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలను విద్యార్థులకు హిస్టరీ ఉపన్యాసకులు తెలిపారు.ఏక్తా శపథ్’ (ఐక్యతా ప్రతిజ్ఞ) చేశారు. “దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఐక్యతా స్ఫూర్తితో ఈ ప్రమాణం స్వీకరిస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సామల వివేకానంద,కేదారేశ్వర్,శ్రీధర్,కనకయ్య,ఆంజనేయులు ,రాజయ్య, అరుంధతి ,విజయ, సరోజ, సురేష్ ,శశిధర్, చంద్రశేఖర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత,అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
