ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి

వరంగల్/సంగెం,నేటిధాత్రి :

సంగెం మండల కేంద్రానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గానేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు.కాగా ఈ నెల 1తేదీన రావుల క్రాంతికి ఉద్యోగం వరించింది.ఈ సందర్భంగా సమాజ సేవకులు పులి రాజశేఖర్ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతిని వారి ఇంటి వద్దకు వెళ్లి అభినందనలు తెలిపి శాలువతో తల్లిదండ్రులతో సహా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ మన గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆనందకరమైన విషయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని యువకులు,విద్యార్థులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రేపటి తరం వారికి ఆదర్శంగా నిలువాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!