
పాఠశాలకు దాతల సహకారం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మండల పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థులు చాల్కి గ్రామానికి చెందిన రమేష్ స్వామి, పరశురాం దాతలుగా నిలిచారు. పాఠశాలలో అవసరాలకై రమేష్ ఆటవస్తువుల కోసం రూ. 10,000 శుక్రవారం అందించారు. స్వామి, పరశురాం కలిసి పాఠశాలలో గల 93 మంది విద్యార్థులకు టై, బాడ్జిలు అందించారు.