కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం రోజు గ్రామంలోని గౌడ కులానికి చెందిన పురుషులు నూతన తెల్ల వస్త్రాలు ధరించి కొత్త బిందెలో పరిశుభ్రమైన నీరు పోసి బిందెలు ఎత్తుకొని గౌడ పూజారులు రమేష్,లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయంలోని విగ్రహలకు జలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా మంగళహారతులతో మహిళలు,బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు పొగాకు కృష్ణమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు కక్కేర్ల సాంబయ్య గౌడ్, కోశాధికారి బొమ్మగాని సదానందం గౌడ్, పొగాకు సదయ్య గౌడ్, గుండెబోయిన సుధాకర్ గౌడ్, గుండె బోయిన సాంబయ్య గౌడ్, ముత్యాల వెంకన్న గౌడ్, గడ్డమీది శివశంకర్ గౌడ్, బొమ్మగాని రాజేష్ గౌడ్, పొగాకు సమ్మాలు గౌడ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంజాల వెంకట్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శులు జునూరి నరేష్ గౌడ్, గోపగాని శోభన్ గౌడ్, దుగ్గొండి మండలం అధ్యక్షులు తడుక కొమురయ్య గౌడ్, పొగాకు రమేష్ గౌడ్, డివిజన్ యువజన సంఘం అధ్యక్షులు ఎరుకొండ కర్ణాకర్ గౌడ్, కక్కేర్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *