రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
నిజామాబాద్ పట్టణానికి చెందిన గంగోని గౌతమి తన తోటి కోడలు అయిన మాధురి మరియు వారి పిల్లలతో కలిసి హైదరాబాద్లోని తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లి, తిరిగి నిజామాబాద్ వెళ్లడానికి అని తన యెక్క 10 తులాల బంగారు ఆభరణాలను తన యెక్క హ్యాండ్ బ్యాగ్ నందు పెట్టుకొని, తేదీ 13.03.2024 నాడు మధ్యాహ్నం కొంపల్లి బస్ స్టాప్, అక్కడ నుంచి నిజామాబాద్ కు డైరెక్ట్ గా బస్సు లేకపోవడంతో చాలాసేపు వేచి చూసి, రామాయంపేట వెళ్ళు బస్సు రాగా, వారందరూ అట్టి బస్సు ఎక్కి రామాయంపేటలో అందాజా సాయంత్రం ఐదున్నర గంటలకు దిగినారు. తర్వాత 7:30 గంటలకు నిజామాబాద్ వైపు వెళ్ళు బస్సు ఎక్కగా, బస్సు స్టార్ట్ అయి రామాయంపేట హైవే పైకి వెళ్ళగానే, గౌతమి తన యొక్క హ్యాండ్ బ్యాగ్ ను ఒకసారి చెక్ చేసుకోగా, తను హ్యాండ్ బ్యాగ్ లో ఉంచినటువంటి మూడున్నర తులాల బంగారు తీగ, మూడున్నర తులాల బంగారం నెక్లెస్, ఒకటిన్నర తులాల బంగారు కమ్మలు మరియు ఒకటిన్నర తులాల బంగారు కమ్మల బుట్టలు మొత్తంగా 10 తులాలు బంగారు ఆభరణాలు బ్యాగులో కనిపించలేదు. ఇట్టి విషయం పై గౌతమి రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఇట్టి కేసు విచారణ సీఐ వెంకటేష్, ఎస్సై రంజిత్ విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం రామాయంపేట పట్టణ పరిధి లోని ఆద్య హోటల్ ముందు UNNA ఎక్స్ రోడ్ వద్ద రామాయంపేట వెహికల్ చెకింగ్ చేస్తుండగా, ఒక మహిళ అప్పుడే హైదరాబద్ వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు నుండి దిగి, రామాయంపేట పట్టణం వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఆమె అనుమానాస్పదంగా ఉండగా, ఆమె ను రామాయంపేట సీఐ,ఎస్ఐ విచారించగా, తన పేరు ఠాకూర్ శారద భర్త అజయ్ సింగ్, వయసు 50 సంవత్సరాలు కులం రాజ్ పుట్ R/o బొల్లారం, హైదరాబాద్ అని తెలిపి, తను దొంగతనాలు చేయడానికి అని బస్టాండ్ లో తిరుగుతూ, బస్సు ఎక్కుతున్న వారి యొక్క పర్సులు మరియు బంగారు ఆభరణాలు కొట్టేస్తున్నాను అని, ఆమె గతం లో కూడా హైదరాబాద్ పరిదిలో ఇదే విదంగా దొంగతనాలు చేయగా, ఇప్పటికే ఆమె పై హైదరాబాద్లోని గోపాలపురం, మహంకాళి, మార్కెట్ మరియు బేగంపేట్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయి, జైలుకు కూడా వెళ్ళినది. మరియు తేదీ 13.03.2024 నాడు సాయంత్రం రామాయంపేట బస్టాండ్ కి దొంగతనానికి వచ్చి, అక్కడ ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో రద్దీగా ఉన్న RTC బస్ స్టాండ్ లో నిజామాబాద్ వైపు వెళ్ళు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కు ఉండగా, ఆమె హ్యాండ్ బ్యాగ్ యొక్క జిప్ ఓపెన్ చేసి అందులో గల బంగారు ఆభరణాలను దొంగిలించినది. ఆ వెంటనే ఆమె బొల్లారంలోని తన ఇంటికి వెళ్లి, అప్పటినుంచి ఆ ఆభరణాలు తన తోనే ఉంచుకొని, తిరిగి నిన్న రామాయంపేట బస్సు స్టాండ్ కు దొంగతనం చేయటానికి వస్తుండగా పొలిసు వారు విచారించగా తన బ్యాగులో ఉన్నటువంటి దొంగిలించినటువంటి బంగారు ఆభరణాలు చూపించగా, వెంటనే సి.ఐ రామాయంపేట వాటిని స్వాధీనం చేసుకుని,ఆమె ను అరెస్టు చేసినారు. ఇట్టి బంగారం ఆభరణాలను పరిశీలించగా పది తులాలుగా ఉన్నవి.
ఇట్టి కేసు చేదనలో చాకచక్యంగా వ్యవహరించి, “కేసును చేదించిన” సిఐ వెంకటేష్, ఎస్ఐ రంజిత్, హెడ్ కానిస్టేబుల్ వీరన్న, కానిస్టేబుల్ నాగాబుషణం, సాజిద్, శ్రీను, మౌనిక, నోమలత, హోం గార్డ్ లావణ్య లను అబినందించటం జరిగింది.