గోటి తళంబ్రాలతో భద్రాద్రికి వచ్చిన భక్తులకు మజ్జిగ, పానకం పంపిణీ
2000 మందికి అన్నదానం చేసిన నృసింహ సేవా వాహిని
భద్రాచలం నేటిదాత్రి
భద్రాచలం : ప్రతి నిత్యం ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో తరిస్తున్న నృసింహ సేవా వాహిని నేడు భద్రాద్రి రామయ్య కు గోటి తలంబ్రాలు ప్రతి సంవత్సరం హోలీ పార్వదినాన ప్రతి గడప రామయ్య కళ్యాణం కొరకు ఈ తలంబ్రాలను రామ నామం చెపుతూ గోటితో వలిచి తేవడం ఆనవాయితీ ఈ సంవత్సరం అనేక మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి రావడం జరిగినది.రామయ్య సేవలో మనవంతు సేవలు అందించాలని నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో నడిచి వచ్చే భక్తులకొరకు అనేక ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చడమే కాకుండా సుమారు రెండువేల మందికి అన్నప్రసాదాన్ని అందించి భక్తుల పాలిట పెన్నిధిగా నిలిచింది శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ రాముడు నడయాడిన ఈ పుణ్య భూమిలో రామ కార్యం కొరకు వచ్చే భక్తులకు మా వంతు సేవలందించడం మా అదృష్టంగా భావిస్తున్నామని ప్రతి హోలీ పర్వదినాన మజ్జిగ మంచినీరు, పానకం, అన్న ప్రసాదం అందిస్తూ వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.