సిద్ధాంతమే శ్వాసగా..బిజేపి ఊపిరిగా!

-బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎదిగేదాక.

-సనాతన ధర్మం సాక్షిగా..ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా

-దేశం కోసం, ధర్మం కోసం, కట్టర్‌ హిందూ అనే ముద్ర దాకా…

-కమ్యూనిజానికి వ్యతిరేకంగా.. బిజేపికి అనుకూలంగా.

-మానవత్వానికి బాసటగా..పార్టీకి న్యాయ సహాయకుడిగా

-పదవులకు కోసం కాకుండా.. పార్టీ కోసం పనిచేసిన నాయకుడుగా

-విద్యార్థి ఉద్యమాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు, రాజకీయ ప్రస్థానం దాకా

-పార్టీకి అలుపెరగని సేవలందిస్తున్న నాయకుడు ఎన్‌. రామంచంద్రరావు.

-‘‘నేటిధాత్రి’’ గత ఎడాది కాలంగా అనేక సార్లు చెప్పింది.

-రామచంద్రరావుకే బిజేపి అధ్యక్ష పదవి అని రాసింది.

-ఇప్పుడు అదే నిజమైంది. రామచంద్ర రావు కు గౌరవం దక్కింది.

జీవితాంతం నమ్మినసిద్దాంతం కోసం రాజకీయాలు చేసే వారు అతికొద్ది నాయకుల్లో ఎన్‌. రామచంద్రరావు ఒకరు. ఆయన చేసిన ఉద్యమాలు, త్యాగాలు చాలా గొప్పవి. తెలంగాణలో బిజేపి ఉనికి కోసం, ప్రస్తానం కోసం ఆయన పడిన శ్రమ ఈ తరానికి తెలియకపోవచ్చు. కాని బిజేపి జెండా రెపరెపలాడాలని కలలు గని కష్టించిన అతి కొద్ది మంది నాయకుల్లో రామచంద్రరావు ముందువరసలోవుంటారు. సహజంగా పార్టీ బలపడిన తర్వాత పాతతరం నేతలు కాస్త కనుమరుగు కావడం సహజం. కానీ రామచంద్రరావు సుమారు నలభై ఏళ్లుగా బిజేపికి సేవ చేస్తూనేవున్నారు. విద్యార్ధిరాజకీయాలలో అఖిలబారత విద్యార్ధి పరిషత్‌ను బలంగా విద్యార్ధి సమాజంలోకి తీసుకుపోవడంలో రామచంద్రరావు పాత్ర ఎంతో గొప్పది. నిజానికి ఆయన ఎప్పుడో పెద్ద నాయకుడు కావాలి. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకులుగా పేరున్న వాళ్లెంతో మంది నాయకులయ్యారు. కాని రామచంద్రరావు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. పార్టీని జాతీయ స్ధాయిలో నిలబెట్టేందుకు కృషిచేశారు. ఒకప్పుడు తెలంగాణలో బిజేపి జెండా పట్టుకునేవారు లేరు. కొద్ది మంది మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ బావాలకు ఆకర్షితులై, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవారు. అయితే ప్రజల్లో స్పందన కనిపించకపోయినా, ఎప్పటికైనా సమాజంలో మార్పు వస్తుందని రామచంద్రరావు నమ్మారు. అది రెండు దశాబ్ధాలుగా నిజమౌతోంది. అయినా ఏనాడు పార్టీలో తనకు ఈ పదవి కావాలని, ఆ పదవి కావాలని కోరుకున్నది లేదు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాలంటే కూడా నాయకులు ముందుకు వచ్చే పరిస్ధితి లేని సమయంలో అండగా వున్న నాయకుడు రామచంద్రరావు. నగరం నుంచి పార్టీని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల దాకా పెరిగేందుకు కృషి చేసిన నాయకుడు రామచంద్రరావు. పార్టీ పిలిచి పదువులు ఇవ్వడం తప్ప, తనకు పదవులు కావాలని ఏనాడు కోరలేదు. ఇక బిజేపికి లీగల్‌ సెల్‌ బాద్యుడిగా ఆయన చేసిన సేవలు సామాన్యమైనవి కాదు. పార్టీ కోసం, ఆయన అనేక త్యాగాలు చేశారు. తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో బిజేపి నాయకులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారికి న్యాయపరమైన సేవలు అందించిన ఏకైక నాయకుడు రామచంద్రరావు. ఎంతటి క్లిష్టమైన కేసులైనా అవలీలగా గెలిచి, పార్టీ నాయకులను శిక్షలను తప్పించి, పార్టీకి సేవ చేశారు. బిజేపి నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులకు ఉచిత న్యాయ సేవలందించారు. అందుకే ఆయన వెనుకబడి పోయారని కూడా ఆయన సన్నిహితులు అంటుంటారు. అయితే ఈసారి ఎలాగైనా రామచంద్రరావు తెలంగాణ అద్యక్షుడు అవుతారని నేటి ధాత్రి ఏడాది కాలంగా చెబుతోంది. గత ఆరు నెలల కాలంగా ఎంత విసృతమైన బిజేపి అద్యక్ష పదవిపై రకరకాల చర్చలు జరుతున్నా బిజేపి అద్యక్ష ఎంపిక సమయం కూడా ఖచ్చితంగాచెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అదిగో బిజేపి అద్యక్షుడు వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడని వార్త పత్రికలు, మీడియా సంస్ధలు విపరీతమైన ప్రచారం చేస్తున్న సమయంలో బిజేపి ఆలోచనలు, అడుగులు పక్కాగా చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అంతే కాదు రకరకాల నాయకులు పేరు తెరమీదకు తెచ్చి గందరగోళం సృష్టించిన మీడియాకుకూడా రామచంద్రరావుకే ఈసారి అవకాశం అని చెప్పిన ఏకైక మీడియా నేటిదాత్రి. ఇప్పుడు అదే నిజమైంది.ఎందుకంటే పార్టీ కేంద్ర విభాగం ఆలోచనలు ఎప్పటికిప్పుడు నేటిధాత్రి పసిగడుతూ చెబుతూనే వుంది. ఈసారి ఆర్‌ఎస్‌ఎస్‌ వాదికే బిజేపి అద్యక్ష పదవి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిజేపి బలపడక ముందు ఇతర పార్టీల నుంచి రావాలంటే నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. గతంలో బిజేపి కేంద్రంలో అదికారంలో వున్నప్పటికీ బిజేపిలో చేరడానికి ముందుకొచ్చేవారు కాదు. కాని ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి బిజేపి దేశ వ్యాప్తమైంది. అప్పటి నుంచి ఇతర పార్టీలలో స్ధానం లేదనుకున్నవాళ్లు బిజేపిలో చేరుతూ వచ్చారు. కొన్ని కటువుగా అనిపించినా సరే నిజాలు చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో బిజేపిలో చేరిన వారు ఎవరూ బిజేపి సిద్దాంతాలకు ఆకర్షితులై చేరిన వారు కాదు. తమ రాజకీయ ప్రాబల్యం కోసం, పరపతి కోసం , రాజకీయ పదువుల కోసం, ఎన్నికల్లో సీట్ల కోసం చేరిన వారే ఎక్కువ. రాజకీయంగా ఇతర పార్టీలలో ఆశ్రయం దొరకని వారు కూడా చాల మంది బిజేపి గొడుకు కిందికు చేరారు. ఆ తర్వాత తమదే పెత్తనం అని కలలుగన్నవారున్నారు. బిజేపిపార్టీ వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు దారి దొరికిందన్న ఆలోచన లేకుండా తమ వల్లే బిజేపి ఎదిగిందని అనుకుంటున్న వారు కూడా తెలంగానలో చాలా మంది వున్నారు. అలాంటి నాయకులు ఈసారి పగటి కలలు కంటూ వచ్చారు. పార్టీని ఏలుదామనుకున్నారు. కాని అన్ని రాజకీయ పార్టీలు వేరు. బిజేపి వేరు. ఎందుకంటే దివంగత వాజ్‌పాయ్‌ ప్రధానిగా వున్నప్పుడు , తమిళనాడుకుచెందిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో ఒక్క ఓటుతో బిజేపి కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. నిజానికి ఆనాడు వాజ్‌పాయ్‌ తన పదవిని నిలుపుకోవాలంటే ఏ ఒక్క ఎంపిని మద్దతు కావాలని కోరినా సరిపోయేది. కాని ధర్మంగా పాలన చేయాలనుకున్నప్పుడు ప్రజల తీర్పుతో మళ్లీ వస్తా అని చెప్పారు. మళ్లీ బిజేపిని గెలిపించి వాజ్‌పాయ్‌ ప్రధాని అయ్యారు. అంతటి అంకితభావం ఒక్క బిజేపిలోనే చూస్తారు. అలాంటి పార్టీలో అవకాశవాదులకు, వలసవాదులకు పార్టీపరమైన పదవులు అప్పగించొద్దని ఈసారి బిజేపి కేంద్ర పెద్దలు ఆలోచించారు. జీవితాంతం పార్టీ కోసం త్యాగం చేసిన, కృషి చేసిన ఎన్‌. రామచంద్రరావును సేవలను గుర్తించారు. బిజేపి ఉనికి కోసం ఆరాపడుతున్న సమయం నుంచి, బిజేపి బలపడి దేశాన్ని ఏలుతున్న రోజుల దాకా పార్టీ కోసం పనిచేసిన రామచంద్రరావుకు గుర్తింపు దక్కడమంటే ఆయనకు పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పాలి. నిన్నగాక మొన్న చేరిన వారు , పార్టీ చలవతో పదవులు పొందిన వారు పోటీలు పడడం విడ్డూరం. అంతే కాదు బిజేపి అద్యక్షపదవికి పోటీ పడుతున్నట్లు నిత్యం ప్రచారం చేసుకున్నవారెవరూ అసలైన బిజేపి నాయకులు కాదు. సనాతన ధర్మం గొప్పదనం తెలిసిన వారు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలను మోసిన వారు కాదు. కేవలం రాజకీయ భవితవ్యం కోసం వచ్చినవారే. అందువల్ల తెలంగాణలోని నిబద్దులైన బిజేపి నాయకులు ఈసారి ఎలాగైనా బిజేపి సిద్దాంతాలను నరనరాన జీర్ణించుకున్న వారికే ఇవ్వాలని కోరుకున్నది. కేంద్ర పార్టీ అదే చేసింది. అయితే రామచంద్రరావు ఎంపికపై రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. వారికి పదవి దక్కలేదన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!