చిట్యాల, నేటిధాత్రి :
సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధురాలు రమాబాయి అంబేద్కర్*
అని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు.
శుక్రవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జరిగాయి .రామాబాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ రమాబాయి సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయురాలు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ ఏబియస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ పాటల రచయిత సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ మండల నాయకులు కట్కూరి రాజేందర్ సరిగొమ్ముల రాజు తదితరులు పాల్గొన్నారు.