ఓదెల లో మత్తు పదార్థాలను నిర్మూలనకై ర్యాలీ

యువత డ్రగ్స్ వినియో గానికి దూరంగాఉండాలి

ఎస్సై అశోక్ రెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలకై విద్యార్థుల అవగాహన కొరకు మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులచే ఓదెల గ్రామం లో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.నిషేధిత మత్తుపదా ర్థాలవాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిది అని ఎస్సై పేర్కొన్నారు తెలిసి తెలియక మత్తు పదార్థాల బానిస బారిన పడటం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనమవు తుందని యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు నిషేధిత మత్తు పదార్థాలను వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.గంజాయి,ఓపియం,హెరాయిన్ వంటి ఇతర నిషేధిత ట్రాక్స్ సరఫరా ముఠాలను పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగు తుందని పేర్కొన్నారు. యువతలో మత్తు పదార్థాలు వినియోగం వల్ల కలిగే అనర్ధాల పట్ల అవగాహన కల్పించేలా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పొత్కపల్లి ఎస్సై,G అశోక్ రెడ్డి,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జావిద్,వైస్ ప్రిన్సిపాల్ మరియు పోలీస్ సిబ్బంది శ్రీకాంత్, రామకృష్ణ,రాజు,అశోక్, రాజేందర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *