నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోడెం వీరయ్య చేతుల మీదుగా ప్రారంభం

భద్రాచలం నేటి దాత్రి

పాల్గొంటున్న రాష్ట్ర స్థాయి జట్లు
ముస్తాబైన జూనియర్ కళాశాల క్రీడా మైదానం
భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొడెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 50,000/-, రెండో బహుమతిగా 25,000/-, మ్యాన్ ఆఫ్ ది సీరియస్ గా 5,000/- రూపాయలను ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వనున్నట్లు వారు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ను నేడు మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య లాంచనంగా ప్రారంభించనున్నారు. టెన్నిస్ బాల్ తో జరగనున్న ఈ మ్యాచ్లు ప్రతి మ్యాచ్ నిర్ణీత 10 ఓవర్లు మాత్రమే జరుగునని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో
టోర్నమెంట్ వ్యవస్థాపకులు పొలమూరి బసవరాజ్, కాపుల శ్రీను, అలీం, మణి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *